జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ
(ఫిబ్రవరి 4వ తేదీన ది హిందు పత్రికలో ప్రచురించబడిన ఆర్టికల్ “Dispossession, development and democracy” కు ఇది యధాతధ అనువాదం. -విశేఖర్)
“న్యాయమైన పరిహారం పొందే హక్కు, భూ స్వాధీనం, పునరావాసం మరియు పునఃస్ధిరనివాస చట్టం” (Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act –LARR) ను సెప్టెంబర్ 2013లో ఆమోదించినప్పటి నుండి అది అన్ని వైపుల నుండి విమర్శలు ఎదుర్కొంది. భూములు కోల్పోయినవారికి సరిపోయినంత పరిహారం కల్పించడంలో ఈ చట్టం విఫలం అయిందని, నీటిపారుదల ప్రాజెక్టులకు మినహాయింపు ఇవ్వడం లాంటి భారీ కంతలు చట్టంలో ఉన్నాయని, ముఖ్యంగా ప్రైవేటు కంపెనీల కోసం భూములను స్వాధీనం చేసుకునేందుకు అవకాశం ఇస్తోందని రైతులు మరియు సామాజిక ఉద్యమకారులు వాదించారు. మరోవైపు పారిశ్రామికవేత్తలు, డెవలపర్లు, రాష్ట్ర ప్రభుత్వాలేమో ఈ బిల్లు ప్రాజెక్టులను ఆలస్యం చేస్తుందని, భూ స్వాధీనం ఖర్చును పెంచుతుందని, ఆర్ధిక వృద్ధికి ఆటంకం అనీ ఫిర్యాదు చేశారు. (ఇప్పటి కేంద్ర) ప్రభుత్వం రెండో అభిప్రాయంతో ఏకీభవించిందన్న సంగతి రహస్యం ఏమీ కాదు. దరిమిలా డిసెంబర్ 31 తేదీన జారీ చేసిన ఆర్డినెన్స్ ద్వారా ఎల్.ఎ.ఆర్.ఆర్ లోని కీలకమైన అంశాలను అది నీరు గార్చడంలో ఆశ్చర్యమూ ఏమీ లేదు.
ఇష్టానుసారం భూముల నుండి తరిమివేయబడడం నుండి గ్రామీణ ప్రజలకు కాస్త రక్షణ కల్పించిన ఎల్.ఎ.ఆర్.ఆర్ చట్టంలోని ప్రధాన అంశాలను ఆర్డినెన్స్ తొలగించివేసింది…
అసలు టపాను చూడండి 668 more words